తెలుగు ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ నట వారసురాలిగా సిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు భాషల్లోను శ్రుతికి మంచి మార్కెట్ ఉంది. ఇక హీరోగా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ఉన్న కమల్ హాసన్..వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. మొదటి వివాహం తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి తన సహనటి సారికను పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. ఆ తర్వాత సారికకు విడాకులు ఇచ్చిన కమల్ హాసన్ మరో నటి అయిన గౌతమితో చాలా సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. అప్పటికే గౌతమికి ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే.
చాలా కాలం వరకు తల్లి సారికతో ఉన్న శృతి హాసన్, అక్షర్ హాసన్ హీరోయిన్లుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ కమల్ హాసన్ వద్దే ఉంటున్నారు. ఇండస్ట్రీలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు లో కూడా మంచి విజయాలు సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగు లో పెద్దగా ఛాన్స్ లు రావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ..తన తల్లితో కలిసి ఒక నిర్మాణ సంస్థను ఆరంభించినట్టు చెప్పింది.
మా అమ్మా నాన్నలు చాలా చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వాళ్ల వారసురాలిగా నేను ఈ రంగంలోకి వచ్చాను. వారి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన నాపై అంచనాలు వుండాలని నేను అనుకోను .. నాకు తోచినట్టుగా నేను అందుకు సంబంధించిన పనులను చేసుకుంటూ వెళుతుంటాను.
నేను మా నాన్నకి సంబంధించిన చిత్రాలకి పనిచేశాను .. ఆయనతో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వపడుతుంటాను. అంతే కాదు నేను మా అమ్మతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను..అందుకే ఓ నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించాము. అన్నీ కుదిరితే మా అమ్మతో ఓ చిత్రాన్ని ప్రారంభిచాలనుకుంటున్నాను అన్నారు శృతి హాసన్.