ఈ ఏడాది సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నిఅందుకున్న రాంచరణ్ ప్రస్తుతం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.  చిరంజీవి పుట్టిన రోజు కానుకగా అభిమానుల కోసం ఒకరోజు ముందే ‘సైరా’ టీజర్ రిలీజ్ చేశారు.  ఈ టీజర్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి.  గతంలో రాంచరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ధృవ’ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. 

తమిళంలో మోహన్ రాజా దర్శకత్వంలో 'తనీ ఒరువన్' చిత్రం తెరకెక్కింది. అరవింద్ స్వామి .. జయం రవి .. నయనతార ప్రధానమైన పాత్రలను పోషించారు.  తెలుగు లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్, అరవింద స్వామి, రకూల్ ప్రీత్ సింగ్ ‘ధృవ’పేరు తో తెరకెక్కించారు.  ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి .. చరణ్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది.
Image result for DHRUVA MOVIE
ఈ రోజుతో 'తనీ ఒరువన్' మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా దర్శకుడు మోహన్ రాజా ప్రకటించారు.  అయితే ఈ సినిమాలో జయం రవి హీరోగా నటించగా విలన్ అనేది ఎవరో ఇంకా అనౌన్స్ మెంట్ చేయలేదు. తమిళంలో ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతూ ఉండటంతో, తెలుగులో 'ధ్రువ'కి కూడా సీక్వెల్ వచ్చే అవకాశం ఉందనే టాక్ మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: