సినీ పరిశ్రమలో కొన్ని హిట్లు వస్తే వాళ్ల రేంజ్ ఒక్క సారిగా పెరిగిపోతుంది. వద్దనే కొద్దీ అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. ఇప్పడూ ఇదే అదృష్టం హీరోయిన్ రష్మిక మందన కు వచ్చింది. 'ఛలో', 'గీత గోవిందం' సినిమాలతో ఆమె బిగ్ స్టార్‌గా మారింది. ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ జరుగుతోంది.  తన సక్సెస్‌తో పాటు గ్లామర్‌పై రష్మిక స్పందిస్తూ, నాయికలంటే అందంగా ఉండాలి. గ్లామర్‌గా కనిపించాలని ఏం లేదని చెబుతోంది.


ఆ హీరోయిన్ కోసం నిర్మాతలు ఎగపడుతున్నారు..!

తన దృష్టిలో అందమంటే వ్యక్తిత్వమని కొత్త నిర్వచనం చెప్పింది. తాను మిస్‌ క్లీన్‌ అండ్‌ క్లియర్‌ బ్యూటీగా ఎంపికైంది కూడా తన ఆత్మవిశ్వాసంతోనే అని గుర్తు చేసింది. రశ్మిక అభిప్రాయంలో చెప్పాలంటే… నేనేం అందగత్తెను కాను. నాకు మేకప్‌ వేసుకోవడం, బాగా అలంకరించుకోవడం ఇష్టముండదు. నాలాంటి హీరోయిన్‌లను తెరపై ప్రేక్షకులు చూస్తారా అని తొలి చిత్రానికి భయపడ్డాను.


ఆ హీరోయిన్ కోసం నిర్మాతలు ఎగపడుతున్నారు..!

నటించే పాత్ర బాగుంటే గ్లామర్‌గా ఉండాలనేది పట్టించుకోరని అర్థమైంది. నేనెలా ఉంటానో అలా సహజంగా కనిపించడమే నాకిష్టం. బయటకు వెళ్లినప్పుడు ఏమాత్రం మేకప్‌ లేకుండా వెళ్తాను. సినిమాలోనూ అలాగే ఉంటానని చెబుతాను కానీ సినిమా కోసం యూనిట్‌ చెప్పినట్లు నడుచుకోవాలి కాబట్టి తప్పడం లేదు. అవకాశాలు వస్తున్నాయి కదానీ అన్ని చిత్రాలు అంగీకరించను. అలా చేస్తే ఏ ఒక్క సినిమాకూ న్యాయం చేయలేను. నేను ఒప్పుకున్న చిత్రమేదైనా నా ప్రయత్నం వందశాతం ఉండేలా చూసుకుంటాను. అని చెప్పింది. కాగా, ఈ భాగమ కన్నడంలో చేసిన మూడు, తెలుగులో నటించిన రెండు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి


మరింత సమాచారం తెలుసుకోండి: