నందమూరి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు నందమూరి హరికృష్ణ మరణంతో శోక సంద్రంలో మునిగిపోయారు. తన అభిమాని కుమారుడి వివాహ వేడుక నిమిత్తం బయలుదేరిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.   'ఏపీ 28 బీడబ్ల్యూ 2323' నంబరుగల కారులో మరో ముగ్గురితో కలసి హరికృష్ణ ప్రయాణిస్తున్న వేళ, ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మృతి వార్త విని నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనను కుటుంబ పెద్దగా చూసుకున్నారు.  తన కుటుంబం అంటే ఎంతగానో అభిమానించే నందమూరి హరికృష్ణ అకాల మరణం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.   నటుడిగా, రాజకీయ నాయకుడిగా హరికృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  నటుడిగా కొనసాగుతున్న సమయంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.
Image result for NANDAMURI HARIKRISHNA
అయితే తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ..చైతన్య రథానికి సారధిగా వ్యవహరిస్తు వచ్చారు.  ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లాంటి హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నందమూరి హరికృష్ణ మరణం యావత్ తెలుగు ప్రజలను శోకసంద్రంలో ముంచింది.  టీడీపీ అభిమానులు కామినేని ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకుంటుండటంతో పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, బందోబస్తును పెంచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: