తెలుగు లో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 సీజన్ రోజు రోజుకీ ఆసక్తి పెరుగుతుంది. బిగ్ బాస్ ఇంట్లో సభ్యుల ఆగ్రహావేశాలు, గొడవలు పడటం చూశాం..కానీ నిన్న బిగ్ బాస్ లో ఏకంగా హత్యలు జరగడం కలకలం సృష్టించింది. అదేంటీ బిగ్ బాస్ లో హత్యలు ఏంటా అని కంగారు పడుతున్నారా..! అబ్బే అదో టాస్క్ మాత్రమే. బిగ్ బాస్ ఇంటి సభ్యులను సాధారణ ప్రజలు, హంతకుడు, పోలీస్, డిటెక్టవ్ ప్రాత్రలు ఇచ్చారు. పోలీస్, డిటెక్టివ్ తప్ప సాధారణ ప్రజలు ఎవరు, హంతకుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. కొన్ని రహస్య టాస్క్ లను హంతకుడు విజయవంతంగా చేయగలిగితే హత్యలు చేసినట్లే. హంతకుడెవరో పోలీసు, డిటెక్టివ్ కనిపెట్టాలి. ఇదీ మంగళవారం రాత్రి టాస్క్.
డిటెక్టివ్ గా గణేష్ , పోలీస్ గా రోల్ , మర్డరర్ పాత్రలో గీత లు ఉన్నారు. అయితే గీతా మాధురికి మరో విచిత్రమైన రహస్య టాస్క్ ఇచ్చారు. సాధారణ సభ్యుల్లో ఒకరితో డాన్స్ చేయించాలి. ఇంకొకరికి కోపం తెప్పించాలి. మరొకరితో తినిపించాలి. ముందుగా గీత…శ్యామలను ఎంచుకుని డాన్స్ చేయించారు. ఆ తరువాత కౌశల్ ను రెచ్చగొట్టి కోపం తెప్పించారు. అయితే ఇది గీతా మాధురి రహస్య టాస్క్ అనుకోని కౌశల్ ఆమెతో మాటకు మాట జవాబు ఇస్తూ..అందరినీ కంగారు పెట్టాడు. మొత్తానికి విరి మద్య జరుగుతున్న వివాదాన్ని దీప్తి ఆపేసింది.
అయితే గీతా మాధురి రహస్య టాస్క్ గెలిచిన శ్యామల, కౌశల్ లు హత్యకు గురయ్యారని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అసలు ఎవరు చేశారో తెలియక అందరూ ఉత్కంఠలో ఉన్నారు. ఎదో రహస్య టాస్క్ ను ప్రయోగించడం ద్వారా ఈ హత్యలు చేసినట్లు అందరూ గుర్తించినా…అసలు దాన్ని ఎవరు ప్రయోగించారు, ఏమి ప్రయోగించారో తెలియక అందరూ జుత్తు పీక్కుంటున్నారు. అందరూ అమిత్ ను అనుమానిస్తున్నారు. ఈ టాస్క్ ఎలా ముగుస్తుందో బుధవారం ఎపిసోడ్ లో చూడాల్సిందే.