ఈ రోజు తెలుగు ఇండస్ట్రీకి విషాదకరమైన రోజు. టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ అభిమానులను, కార్యకర్తలను కన్నీటి సాగరంలో ముంచి అనంతలోకాలకు వెళ్లారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించేందుకు ఇంటికి బయలు దేరారు. ఇదిలా ఉంటే ఈ రోజు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు..కానీ ఆయన తన పుట్టిన రోజు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇక నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయులు నటించిన సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రద్దు అయ్యాయి.
అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనకున్నారు..కానీ ఆలోచనను విరమించుకున్నారు.
ఇక ఈ రోజున 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చైతూ సరసన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించింది. కాకపోతే..హరికృష్ణ హఠాన్మరణం కారణంగా, ట్రైలర్ విడుదలను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకి సంబంధించిన కొత్త తేదీలను ఎనౌన్స్ చేయనున్నారు.