నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు.  ఆయన మరణంతో ఒక్కసారిగా తెగులు ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.  ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.  ప్రస్తుతం ఆయనకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులర్పించేందుకు ఇంటికి చేరుకుంటున్నారు. 

తాజాగా మంచు విష్ణు మీడియాకు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ఊహించని విధంగా ఈ ప్రమాదంలో తమ ఆత్మీయుడిని కోల్పోయిన అనుచరులు, కుటుంబ సభ్యులకు మీడియాలో వచ్చే దృశ్యాలు మరింత బాధను కలుగజేస్తాయి.

ఆయన మనందరి మనిషి. దయచేసి ఆయన్ని గౌరవిద్దాం. నా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నా. ధన్యవాదాలు’ అని మనోజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఇదిలా ఉంటే..మనోజ్ చేసిన ట్విట్ కి నందమూరి అభిమానులు స్పందిస్తున్నారు..అవును నిజంగా టీవీల్లో చూపించే దృశ్యాలు మరింత క్షోభకు గురిచేస్తున్నాయని మనోజ్ ట్వీట్‌కు రిప్లైలు ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: