మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతికి సంతాపంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ జెండాను అవనతం చేయాలని ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. నేడు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో అధికా లాంఛనాలతో చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 
Image result for nandamuri harikrishna
హరికృష్ణ భౌతిక ఖాయానికి సినీ, రాజకీయ, పారిశ్రామిక వెత్తలు నివాళులర్పిస్తున్నారు.   తాజాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ..హరికృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడిపెట్టారు. హరిక‌ృష్ణ తనను ‘అన్నయ్యా’ అని పిలిచేవాడని, ఆయన తనకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ అని అన్నారు.
Image result for nandamuri harikrishna
ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి కడుపున పుట్టినా కూడా ఆయన ఎప్పుడూ గర్వంగా ఉండేవారు..కాదని ఎవరైనా కష్టపడితేనే పైకి వస్తారని చెబుతూ ఉండేవారని అనేవారు.  సున్నిత మనస్తత్వం కలిగిన హరికృష్ణ మరణం తనకు చెప్పలేని బాధ కలిగిస్తోందని కృష్ణంరాజు కన్నీటి పర్యంతమయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: