ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిత్రంగా వచ్చి..అద్భుతమైన విజయం సాధించి వంద కోట్ల టార్గెట్ పూర్తి చేసుకున్న ‘గీతాగోవందం’పై పలువురు సినీ ప్రముఖలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గీత గోవిందం. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు సంచలన కామెంట్స్ చేశారు. ఓ అవార్డు ఫంక్షన్ కి హాజరైన ఆయన ఈ చిత్రంపై తనదైన స్పందన వ్యక్తం చేశారు.
‘గీతాగోవందం’ చిత్రం చూశానని..చాలా అద్భుతంగా ఉందని..ఈ చిత్రం చూస్తున్నంత సేపు గతంలో తాను శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’గుర్తుకు వస్తుందని అన్నారు. ఈ చిత్రంలో ఎక్కడా అశ్లీలానికి తావు ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు ప్రశాంతంగా కూర్చొని చేసేలా ఉంది..ఇప్పుడు ‘గీతాగోవందం’కూడా అలాంటి భావనే కలుగుతుందని ఆ సినిమాకు కాపీ కొట్టారా కాపీ కొట్టాడేమో అనిపించిందన్నారు.
చిన్న సినిమాగా విడుదలైన గీత గోవిందం ఇంత భారీ విజయాన్ని సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో దర్శకుడు పరుశురామ్ని మెచ్చుకోవాలి అని అన్నారు. 20 ఏళ్ల క్రితం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అల్లు అరవింద్, అశ్విని దత్లు నిర్మాతలుగా ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మూడు నంది అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతాగోవిందం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా కుమ్మేస్తుంది.