టాలీవుడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.  అంతకు రెండు భారీ డిజాస్టర్ తో సతమతమవుతున్న మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో ఘనవిజయం సాధించడమే కాదు..రెండు వందల కోట్ల క్లబ్ లో చేరారు.   ప్రస్తుతం నిర్మాత, దర్శకులు వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో మహేష్ లుకింగ్ డిఫరెంట్ గా చూపించబోతున్నాడు దర్శకుడు. 
Image result for jayapradha
ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుండగా.. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కెరియర్ 25 చిత్రంతో భారీ హంగులతో అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అయితే ఒక్క పోస్టర్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.  ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ రాబట్టడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది.   తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 
Image result for jayasudha
మహేష్ బాబు కి తల్లిగా ఈ సినిమాలో అలనాటి అందాల తార జయప్రద నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి..కానీ జయప్రద ప్లేస్‌ను సహజనటి జయసుధ రీప్లేస్ చేసినట్టు తాజా సమాచారం. ఈ మూవీలో మహేష్‌కి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతుండగా.. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘మహర్షి’. గతంలో బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారులోకం, శతమానం భవతి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హిట్ పెయిర్‌గా పేరొందిన ప్రకాష్ రాజ్, జయసుధల మరోసారి కనిపించబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: