దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న యాత్ర సినిమా ఇప్పటికే 90 శాతం పూర్తయింది. ఇంక కొద్దిగా పాదయాత్ర సీన్లు బకాయి వున్నాయి. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే స్లోగా మెల్ల మెల్లగా ప్రచారంలోకి దిగాలన్న అయిడియా, అలాగే వైఎస్ వర్థంతి సందర్భంగా ఏదైనా విడుదల చేయాలన్న ఆలోచనతోనూ ఓ సాంగ్ బిట్ ను విడుదల చేస్తున్నారు.
ఇక నుంచి ఇలా అకేషనల్ గా ఒక్కో పబ్లిసిటీ మెటీరియల్ ను, సినిమాలోని కీలక అట్రాక్షన్లను రివీల్ చేస్తూ వస్తారు. సూపర్ స్టార్ మమ్ముట్టి ని వైఎస్ గెటప్ లో చూపిస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు, అలాగే సినిమా టైటిల్ లోగోకు మాంచి ఆదరణ లభించింది. యాత్ర లోగో ఇప్పటికే జగన్ పాదయాత్రలో చాలాచోట్ల విరివిగా వాడేయడంతో పాపులర్ అయిపోయింది.
ఇప్పుడు ఈ సమరశంఖం పాట ఏమాత్రం ఎమోషనల్ గా, ఎగ్రెసివ్ గా కనెక్ట్ అయినా, దీన్ని జనాల్లోకి తీసుకెళ్లిపోతారు వైఎస్ఆర్ అభిమానులు. ఒక పక్క ఎన్టీఆర్ బయో పిక్ కూడా వేగంగా చిత్రి కరణ సాగుతుంది. అయితే ఎన్టీఆర్ బయో పిక్ ఎన్నికల సమయానికి రావొచ్చని మాటలు వినిపిస్తున్నాయి. అయితే యాత్ర టీజర్ కు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. సినిమా రిలీజ్ అయితే వైస్సార్ అభిమానులకు పండగే అని చెప్పాలి.