తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.   నాగార్జున, నాని నటిస్తున్న ‘దేవదాస్’ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ఇప్పటికే విడుదలై మంచి ఆధరణ పొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ  చిత్రంలో రష్మిక మందన, ఆంకాక్ష లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. దేవగా నాగ్, దాస్‌గా నాని అలరించనున్నారు. 


ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది.  నిన్న కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా  ఫస్ట్ సింగిల్ ‘వారు వీరు’ రిలీజ్ చేయాలని చూశారు..కానీ ప్రముఖ నటులు నందమూరి హరికృష్ణ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తెలుగు ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.  


హరికృష్ణ మృతి కారణంగా నాగ్ తన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ రోజు హరికృష్ణ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి.  కాగా,  దేవదాస్ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘వారు వీరు’ నేటి(గురువారం) సాయంత్రం 6గంటలకు రిలీజ్ కానుంది. వైజయంతి ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: