తెలుగులో ఆ మద్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన కంగనా రౌనత్..హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది.  అయితే హీరోయిన్ గా సాధించిన విజయాల కన్నా.. వివాదాలను గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుకుంటూ వుంటారు. కంగనా రనౌత్ ను దగ్గర నుంచి చూసినవాళ్లు, అనుకున్నది సాధించే స్వభావం ఆమెది అని చెబుతారు. ఈ కారణంగానే తరచూ ఆమె చుట్టూ వివాదాలు అలముకుంటూ వుంటాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. గతంలో క్రిష్ తో జరిగిన వివాదం బాలీవుడ్ లో పెను సంచలనాలకు దారి తీసింది.  


ప్రతి విషయంలోనూ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే కంగాన ఆమె బాయ్ ఫ్రెండ్ తో గడిపిన ఫోటోలు షేర్ చేసి కూడా వివాదాన్ని సృష్టించింది.  తాజాగా కంగనా రౌనత్ కి చెందిన మరో వివాదం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి జీవిత క‌థ ఆధారంగా `మ‌ణిక‌ర్ణిక‌: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తుండ‌గా, టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. 

Image result for manikarnika movie

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం క్రిష్, కంగనా ల మద్య బేదాభిప్రాయాలు రావడం. కానీ ఆ వార్త‌ల‌ను కంగ‌న ఖండించింది. త‌న‌కు క్రిష్‌తో ఎలాంటి విభేదాలూ లేవ‌ని, తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మని చెప్పింది. తాజాగా `మ‌ణిక‌ర్ణిక‌` సినిమాకు సంబంధించి ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
Image result for manikarnika movie
తాజాగా ఈ సినిమా క్లాప్ బోర్డుపై దర్శకురాలిగా కంగన పేరు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పనులను క్రిష్ పూర్తి చేయలేదనే టాక్ వుంది. ఆ కోపంతోనే ఆమె క్లాప్ బోర్డుపై దర్శకత్వం అనే చోట తన పేరు ఉండేలా చూసుకుందని అంటున్నారు. కంగన ఈ విధంగా వ్యవహరించడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: