టాలీవుడ్ లో కామెడీ దర్శకులుగా మారుతి మంచి పేరు తెచ్చుకున్నారు. మొదట్లో ఆయన సినిమాలు ద్వందర్థాలు ఉండేవని..బూతు బాగోతం ఉంటుందని రూమర్లు వచ్చినా..‘ప్రేమకథాచిత్రమ్’తర్వాత ఆ మార్క్ పోగొట్టుకున్నాడు. ఇక నాని తో తీసిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో టాప్ దర్శకుల్లో ఒకరిగా చేరిపోయారు. తాజాగా మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, అను ఎమ్యాన్యుయేల్ ప్రధాన పాత్రలలో ‘శైలజా రెడ్డి అల్లుడు’సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది. శైలజా రెడ్డి చిత్రం కుటుంబ కథా నేపథ్యంలో సాగుతుందట..అంతే కాదు అత్తా, అల్లుడు మద్య సాగే ఫన్నీ గొడవలతో పంచ్ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు మూవీ మేకర్స్. ఇటీవల చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. అయితే మొన్న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉన్నా నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. దాంతో టాలీవుడ్ మొత్త శోకసంద్రంలో మునిగిపోయిన నేపథ్యంలో నాగార్జున తన పుట్టిన రోజు కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్ రిలీజ్ రద్దు చేశారు. తాజాగా శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో చైతూ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నాడు. నాపేరు చైతన్య..అందరూ చైతూ అంటారు..అంటూ ఎండింగ్ లో డాడీ స్కీమ్ వర్క్ ఔట్ అయినట్టుంది..మేడమ్ మన ట్రాక్ లోకి వచ్చేసింది అంటూ ఎండ్ చేశాడు నాగ చైతన్య. ఇక ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. గోపిసుందర్ చిత్రానికి స్వరాలు సమకూర్చారు . లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. మొత్తానికి శైలజా రెడ్డి అల్లుడు ట్రైలర్ చాలా బాగుంది.