కొన్ని దుఖాలు ఒక్కోసారి మంచి చేస్తాయి. కొన్ని చెడు ఘటనలు విడిగా ఉన్న వారిని ఒక్కటిగా కలుపుతాయి. ఇన్నాళ్ళూ దూరం అనుకున్న వారిని ఆ అన్న ఏ లోకంలో ఉన్నా అలా దగ్గర చేసాడు. రక్త బంధం, పేగు బంధం ఎప్పటికీ వేరు కాదన్నది  తరతరాలుగా  రుజువవుతున్న సత్యమే. విషయానికి వస్తే ఆ బాబాయి అబ్బాయి ఇపుడు ఒక్కటై పొయారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.



నందమూరి హరిక్రిష్ణ దుర్మరణం తరువాత మళ్ళీ ఆ కుటుంబమంతా ఒకే ఫ్రేం లోకి వచ్చింది. చాన్నాళ్ళ తరువాత కలసింది. తెలుగుదేశం రాజకీయాలు కుటుంబాలపైన కూడా పడి నందమూరి వారసులైన హరిక్రిష్ణ, బాలక్రిష్ణల మధ్యన కూడా సరైన రిలేషన్లు లేవన్న టాక్ ఆ మధ్యన బాగానే వినిపించేది. దానికి తగినట్లుగా సినిమా ఫంక్షన్లలోనూ బాబాయ్ బాలయ్య, అబ్బాయి జూనియర్ ఎంటీయారు ఒక్కటిగా  కనిపించిన సీన్లు లేవు



ఈ మధ్యన తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ ముహూర్తం షాట్ కి బాలయ్య జూనియర్ ని పిలవలేదని టాక్ నడిచింది. జూనియర్ సైతం తాను ఆ సినిమాలో వేయడం లేదని ఓపెన్ గానే చెప్పేశాడు. ఇదిలా ఉండగా సడెన్ గా హరిక్రిష్ణ దుర్మరణం పాలు అయ్యారు. దాంతో మళ్ళీ ఆ ఫ్యామిలీ ఒక్కటిగా కనిపిస్తోంది.



ఈ రోజు అన్న హరిక్రిష్ణ నివాసమైన మెహదీపట్నంలో బాలయ్య తన అన్న గారి కొడుకులు కళ్యాణ్ రాం, జూనియర్ ఎంటీయార్లతో కలసి భోజనం చేస్తూ కనిపించారు. ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేయడాన్ని వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాతో పెడితే అదిపుడు బాగా వైరల్ అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ దీన్ని చూసి అబ్బాయి, బాబాయి కలసిపోవాలని గట్టిగా కోరుకున్నారు. వారి కోరికే నిజమై రేపటి రోజున అంతా మళ్ళీ ఒక్కటిగా కనిపించే సీన్ దగ్గరలోనే ఉందేమో...చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: