కొన్నిరోజుల క్రితం దిల్ రాజ్ తన ‘శ్రీనివాస కళ్యాణం’ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తూ పెంచిన అంచనాలను ఆమూవీ చేరుకోలేక పోవడంతో ‘శ్రీనివాస కల్యాణం’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు అదే సీన్ నాగశౌర్య కు రిపీట్ అయింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో సెటైర్లు పడుతున్నాయి. 

యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న నాగశౌర్య హీరోగా మరింత రాణించడానికి ఐరా క్రియేషన్స్ అనే స్వంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పరుచుకుని మొదటి ప్రయత్నంగా ‘ఛలో’ మూవీని తీసి సక్సస్ సాధించాడు. దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో అదే సక్సస్ ట్రాక్ ను కొనసాగించాలని మళ్ళీ తన సొంత బ్యానర్ ఫై 15 కోట్ల బడ్జెట్ తో ‘@నర్తనశాల’ నిర్మించాడు. 

ఈమూవీకి పోటీగా విడుదల అవుతుంది అని భావించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ వాయిదా పడటంతో మంచి జోష్ లోకి వెళ్ళిపోయాడు నాగశౌర్య. దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఈమూవీ నచ్చకపోతే ఎవరూ చూడొద్దని నచ్చితే పదిమందికి చెప్పండి నచ్చకపోతే 20 మందికి చెప్పండి అంటూ ఈమూవీ పై ఉన్న నమ్మకంతో పెద్దపెద్ద మాటలు చెప్పాడు. ఇప్పుడు ఈమాటలే నాగశౌర్యకు శాపంగా మారాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈమూవీ ఏవర్గం ప్రేక్షకులకు పూర్తిగా నచ్చక పోవడంతో నర్తనశాలకు మొదటిరోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీనితో నాగశౌర్య చెప్పినట్టు ఇప్పుడీ సినిమా చూడొద్దని 20 మందికి చెప్పాలా అసలు ఈమూవీ రెండవ వారం ధియేటర్లలో ఉంటుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈమూవీ పై నాగశౌర్యకు ఎంత నమ్మకం ఉన్నా నిర్మాతలైన అతడి తల్లితండ్రులు మాత్రం ఈమూవీ ఛానల్ రైట్స్ తో పాటు కొన్ని ఏరియాలకు కూడ ముందుగానే అమ్మిన నేపధ్యంలో ఈమూవీ వల్ల చెప్పుకోతగ్గ నష్టాలు నాగశౌర్య కుటుంబానికి ఉండక పోవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: