టాలీవుడ్ లో సినీతారలు, రాజకీయ నాయకులపై బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని కీర్తి సురేష్ ప్రధాన పాత్రగా ‘మహానటి’ తెరకెక్కించారు దర్శకులు నాగ్ అశ్విన్. ఆ సినిమా గొప్ప విజయం సాధించింది. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్..సాంగ్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇక క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఇక మూవీ షూటింగ్ హైదరాబాద్ లో అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఎన్టీఆర్’ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుండగా, జయప్రద పాత్రలో రాశిఖన్నా, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, ఎస్వీ రంగారావు పాత్రలో ‘నాగబాబు నటించనున్నారు.
ఇటీవల ఇడుదల చేసిన ‘ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్ లో బాలయ్య అచ్చు ఎన్టీఆర్ లా కనిపించిన సంగతి తెలిసిందే. కృష్టాష్టమి సందర్భంగా తాజాగా ‘ఎన్టీఆర్’ చిత్రబృందం మరో ఫోటోను విడుదల చేసింది. ‘కృష్ణా.. ముంకుండా..మురారీ.. నందమూరి నందనవనవిహారి’ అంటూ ఫోటో విడుదల చేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ ఫోటోలో నందమూరి హీరోలు కనిపిస్తున్నారు. హరికృష్ణ, ఎన్టీఆర్, బాలకృష్ణకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో ‘ఎన్టీఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.