తండ్రి మరణంతో ఇప్పటికే దిగాలు పడ్డ జూనియర్ ఎన్టీఆర్ తన బాధను పక్కకు పెట్టి ‘అరవింద సమేత’ ను అనుకున్న తేదీకి విడుదల అయ్యేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఈమూవీకి విజయ్ దేవరకొండ ‘నోటా’ హెచ్చరికలు రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. ముందుగా భావించినట్లుగా దసరా సీజన్ అంత సజావుగా నడిచేలా కనిపించడం లేదు.
ఈసీజన్ లో విడుదల అయ్యే ‘అరవింద సమేత’ ను టార్గెట్ చేస్తూ అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి. ‘అజ్ఞాతవాసి’ పరాజయంతో త్రివిక్రమ్ ఏరికోరి ఎంచుకున్న దసరా సీజన్ త్రివిక్రమ్ జూనియర్ లకు చుక్కలు చూపెట్టబోతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ కు వారం ముందుగా రవితేజ శ్రీనువైట్ల కాంబినేషన్ లోని ‘అమర్ అక్బర్ ఆంథోని’ రిలీజ్ కు రెడీ అవుతుంటే అక్టోబర్ 4వ తేదీన విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘నోటా’ విడుదల అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.
అంతేకాదు ఇదే సీజన్ ను టార్గెట్ చేస్తూ విశాల్ ‘పందెం కోడి 2’ రామ్ నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో తయారవుతున్న ‘హలోగురూ ప్రేమకోసమే’ విడుదల డేట్ ను కూడ దసరా టైమ్ కు అనౌన్స్ చేసారు. ఈచిన్న సినిమాలమాట ఎలాఉన్నా విజయ్ దేవరకొండ మ్యానియాతో ‘అరవింద సమేత’ కు సమస్యలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. జూనియర్ ‘అరవింద సమేత’ కు విజయ్ దేవరకొండ ‘నోటా’ కు కేవలం ఒక్కవారం మాత్రమే గ్యాప్ ఉండటంతో ధియేటర్ల విషయంలో కూడ సమస్యలు ఏర్పడే అవకాసం ఉంది.
సుమారు 100కోట్ల బిజినెస్ చేసిన ‘అరవింద సమేత’ కు ఊహించని విధంగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడ దెబ్బతీయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘అజ్ఞాతవాసి’ సినిమాను నిర్మించిన రాథాకృష్ణ ‘శైలజా రెడ్డి’ మూవీకి కూడ నిర్మాత కావడంతో ‘అజ్ఞాతవాసి’ వల్ల భారీస్థాయిలో నష్టపోయిన బయ్యర్లకు తక్కువ మొత్తానికి ‘శైలజా రెడ్డి’ ని నష్టపరిహారంగా ఇస్తాను అన్నా ఆనష్టపరిహారాన్ని ‘అజ్ఞాతవాసి’ బయ్యర్లు అంగీకరించకుండా తమనష్టాలకు పరిహారంగా ‘అరవింద సమేత’ రైట్స్ ను అడుగుతున్నట్లు టాక్. ఇలా ఎటు చూసినా చక్రవ్యూహంలో ‘అరవింద సమేత’ చిక్కుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..