ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరమీదకు రానున్న ‘అరవింద సమేత’ చిత్రంలో నందమూరి మనవడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ మెడల్, స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రంతో కమెడీ హీరో సునీల్ మళ్లీ కమెడియన్ గా యూటర్న్ తీసుకున్నారు. నిన్నటిదాకా హీరోగా నటించిన సునీల్ మళ్లి హాస్య పాత్రలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న చిత్రం సిల్లి ఫెల్లోస్. నరేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
పూర్ణ, చిత్ర శుక్లా నాయికలుగా నటిస్తున్నారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు. ఈ చిత్రంలో తాను చేసిన పాత్ర విశేషాలు సునీల్ వివరించారు. ఓ ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ …నరేష్తో కలిసి గతంలో తొట్టిగ్యాంగ్, కితకితలు లాంటి చిత్రాల్లో నటించాను. మాకు మంచి అనుబంధం ఉంది. నేను హీరో నుంచి మళ్లి హాస్య పాత్రలు చేయాలనుకున్నప్పుడు మొదట అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని అంగీకరించాను.
తమిళ చిత్రం రీమేక్ అయినా సాధ్యమైనంత మనకు తగినట్లు మార్చాం. ఇతర భాషా చిత్రాలు రిమేక్ చేసినవి బాగా ఆడాయి..కొన్ని దెబ్బతిన్నాయి. అలా రీమేక్ చిత్రాలు చేయడంలో ఒక సేఫ్ గేమ్ ఉంటుంది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇప్పుడున్న స్థాయికి రీమేక్ సినిమాలే కారణం. నేను హీరోగా చేసిన చిత్రాల్లో ఎక్కువగా హాస్యం పండించలేదు. ఇప్పుడీ సినిమాలో మళ్లి అవకాశం వచ్చింది. మళ్లి కమెడియన్గా చేయడం నాకు తేడా ఏమీ అనిపించడం లేదు. నా నట జీవితంలో ఇదో దశ అనుకుంటున్నానని అన్నారు సునీల్. గతంలో నేను నటించిన చిత్రాల్లో హీరోకన్నా నాకే ఎక్కువ పేరు వచ్చినవి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కెరీర్ కొనసాగించాలంటే..మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.