త్రివిక్రం డైరక్షన్ లో మొదటిసారి ఎన్.టి.ఆర్ చేస్తున్న సినిమా అరవింద సమేత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ ఫీమేల్ లీడ్ గా ఛాన్స్ కొట్టేసింది.


ఇక ఈ సినిమాను ఎలాగైనా అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి మరణించిన బాధలో ఉన్నా సరే నిర్మాతకు బడ్జెట్ నష్టం జరుగకూడదని మూడవ రోజే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్.టి.ఆర్. అనుకున్న విధంగా దసరాకి ఎన్.టి.ఆర్ వచ్చేస్తాడని మరోసారి కన్ ఫాం చేశారు.


ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 22న రిలీజ్ ప్లాన్ చేశారట. ఈ ఆడియోకి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ల మధ్య స్నేహం అందరికి తెలిసిందే. ఈమధ్య వారు మరింత సన్నిహితంగా ఉంటున్నారు. అందుకే అది మరింత బలపడేలా తారక్ ఆడియోకి చరణ్ స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడట.


చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఎప్పుడు సీక్రెట్ గా కలిసి ఆ తర్వాత ఫోటోలు బయటకు వచ్చేవి.. కాని ఇలా పబ్లిక్ గా ఫ్యాన్స్ మధ్యలోకి కలిసి రావడం గొప్ప విషయమే. అటు నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ కు ఇది సర్ ప్రైజ్ అన్నట్టే. మెగా నందమూరి అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది అలాంటిది ఫ్యాన్స్ గా మీరు మీ హద్ధుల్లో ఉండండి మేమంతా కలిసే ఉంటున్నాం అంటూ మెసేజ్ పాస్ చేస్తున్నారు స్టార్ హీరోలు. రాజమౌళి డైరక్షన్ లో చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి మల్టీస్టారర్ సినిమా కూడా చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: