భారతీయ సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు చేసిన రికార్డులు ఎప్పటికీ మరువలేని విధంగా ఉన్నాయి.  గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’  ఎన్నో సంచలనాలు సృష్టించింది. లంచగొండి తనం పై సమరశంఖారం పూరించిన ఓ స్వతంత్ర సమరయోధుడిక కథ..సేనాపతిగా ఆయన తనయుడు గా ద్విపాత్రాభినయంతో కమల్ హాసన్ అద్భుతం సృష్టించారు.  తాజాగా ఈ సినిమా సీక్వెల్ రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారతీయుడు చిత్ర 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయడు చిత్రం ఘనవిజయం సాధించి అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 

Director Shankar starts location hunting for Indian 2 movie

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ 2.0 చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగ గడుపుతున్నాడు. 2.0 చిత్ర విడుదల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా శంకర్ భారతీయుడు 2 చిత్ర పనులు ప్రారంభించేశారు.  ఈ సినిమాలోను కమల్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.  ఏయం రత్నం నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం వచ్చే ఏడాదిలో స్టార్ట్‌ కానుంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే.

Image result for భారతీయుడు 2

ఆల్రెడీ ఫస్ట్‌ పార్ట్‌లో తండ్రీ, కొడుకుల్లా రెండు పాత్రల్లో కనిపించిన కమల్, సినిమా చివరలో లంచగొండి అయిన కొడుకుని చంపేస్తాడు. అయితే ఈ   సీక్వెల్‌లో డ్యూయల్‌ రోల్‌ ఎలా తీసుకువస్తారన్నది చర్చనీయాంశం. ఏది ఏమైనా క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ మరో లాజిక్ తోనే అంటే అద్భుతమైన మెసేజ్ తోనే రాబోతున్నట్లు తెలుస్తుంది.  ఇక ప్రధాన కథానాయికగా నయనతార పేరు వినిపిస్తోంది. నయనతారను తీసుకోవడమంటూ జరిగితే ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.        

మరింత సమాచారం తెలుసుకోండి: