తెలుగు ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెంచేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. ఇక గీతా గోవిందం అయితే ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు విజయ్ పారితోషికం రూ.10 కోట్ల వరకూ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సారి విజయ్ దేవరకొండతో కమెడీ దర్శకుడు మారుతి ఛాన్స్ కొట్టేశాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉండగా, మూడు సినిమాలు సెట్స్ పైకి వెళ్లే పనుల్లో వున్నాయి. మారుతి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శైలజా రెడ్డి అల్లుడు' రెడీ అవుతోంది. అక్కినేని నాగ చైతన్య, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రంపై కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. దర్శకులు మారుతి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండను ఖరారు చేసినట్టుగా సమాచారం. గీతాగోవిందంతో కామెడీ ఎంట్రటైన్ చేయడంలో విజయ్ కి మంచి పేరు వచ్చింది..ఇక కామెడీకి పెద్ద పేట వేసే మారుతి గురించి తెలిసిందే..వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రంపై అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. 2019 ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.