తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన అతితక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచుకున్న కథానాయికి రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ లో మోడలింగ్ రంగంలో మంచి పేరు సంపాదించిన రకూల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగు లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి పేరు సంపాదించిన రకూల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల సరసన నటిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. ఆ మద్య తెలుగు టాప్ హీరో తమ పక్కన రకూల్ అయితే బాగుంటుందన్న పరిస్థితి కూడా వచ్చిందని టాక్.
తెలుగులో మంచి ఫామ్ లోకి రాగానే కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది రకూల్. అయితే, గత కొంత కాలంగా ఈ పంజాబీ భామకు అవకాశాలు తగ్గాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పింది. ఈ రోజు ఉన్న ఫేమ్, రేపు ఉండకపోవచ్చని తెలిపింది.
వాస్తవాలను ఒప్పుకుంటే ఎలాంటి భయాలు ఉండవని చెప్పింది. సినిమాలో ఎన్ని రోజులు అవకాశాలు వస్తయో ఎప్పుడు రావో ఎవరు చెప్పలేరని తెలిపింది. ఇక తనకు ఈ రంగంలో పరుగు ఎప్పుడు ఆపాలో తెలుసని… ప్రేక్షకులకు తాను బోర్ కొడుతున్నానని అనిపించినప్పుడు తనంతట తానే ఇండస్ట్రీకి దూరమవుతానని తెలిపింది. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఈ అమ్మడు వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే.