సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి ఈ సినిమా చేస్తున్నారు. ఈమధ్యనే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్.. మహేష్ స్నేహితుడిగా కనిపిస్తాడని తెలుస్తుంది.  


పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కృష్ణుడు, కుచేలుడుగా మహేష్, నరేష్ లు కనిపిస్తారట. అయితే ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ కామెడీగా ఉంటుందట.


సెకండ్ హాఫ్ మాత్రం వంశీ పైడిపల్లి అస్త్రమైన సెంటిమెంట్ తో ఉంటుందట. మహేష్ మార్క్ సెంటిమెంట్ తో పాటుగా స్టైలిష్ ఎంటర్టైనర్ గా మహర్షిని తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తుంది. భరత్ అనే నేను సక్సెస్ తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించిన మహేష్ ఈసారి మహర్షిగా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.


అప్పట్లో సీనియర్ దర్శకుడు వంశీ చేసిన ఆ మహర్షి సినిమాలానే ఈ వంశీ పైడిపల్లి చేస్తున్న మహర్షి కూడా సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని టీజర్ తోనే చూపించారు. మరి స్టైలిష్ లుక్ లో మహేష్ ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: