సీనియర్ హీరోల్లో ఎప్పుడూ డిఫరెంట్ గా సినిమాలు చేసే వెంకటేష్ తన మార్క్ చూపిస్తుంటాడు. గురు తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ వరుసగా రెండు మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి వరుణ్ తేజ్ తో చేసే ఎఫ్-2 కాగా.. నాగ చైతన్యతో చేస్తున్న వెంకీ మామా.


ఈ రెండు మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పచేలా చేశాయి. ఎఫ్-2 ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వస్తుంటే.. వెంకీ మామా మాత్రం సెంటిమెంటల్ మూవీగా వస్తుందట. ఇక ఇవే కాకుండా వెంకటేష్ మరో క్రేజీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్, మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట.


కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంకటేష్, దుల్కర్ సల్మాన్ ఇద్దరు సినిమాకు సై అనేశారట. బడా నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలుస్తుంది. మళయాళ స్టార్ తో వెంకటేష్ మల్టీస్టారర్ అంటే కచ్చితంగా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. మహానటి సినిమాతో తెలుగులో సర్ ప్రైజ్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ ఇక్కడ ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్నాడు.


యుద్ధ నేపథ్యంలో వెంకటేష్, దుల్కర్ సల్మాన్ ల మల్టీస్టారర్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందట. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది. వెంకటేష్ ప్రస్తుతం తాను కమిట్ అయిన ఎఫ్-2, వెంకీ మామా సినిమాల తర్వాత ఈ మల్టీస్టారర్ చేస్తాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: