తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు రాజమౌళికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది.  ఆయన తీసిన చిత్రాలు ఇప్పటి వరకు ఏ ఒక్కటీ అపజయం పొందలేదు.  అందుకే ఆయనను దర్శకధీరుడు అని పిలుస్తారు.  రాజమౌళి దాదాపు ఐదు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ ప్రపంచ స్థాయిలోనే రికార్డుల మోత మోగించింది.  ఒక తెలుగు చిత్రం ఆ స్థాయిలో సత్తా చాటడం అనేది మొదటిసారి..అప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్ లకు మాత్రమే భారీ కలెక్షన్లు వచ్చేవి..కానీ బాహుబలి సీరీస్ తర్వాత ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. 

తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ నిశ్చితార్థం ‘జగపతి’రాజేంద్రప్రసాద్ మనవరాలు పూజా ప్రసాద్ తో జరిగినట్లు సమాచారం.  ఈ ఏడాది చివరిలో వారి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. కాగా, ‘జగపతి’ రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్. భక్తిగీతాలు ఆలపించే పూజా ప్రసాద్ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  మగధీర చిత్రం నుంచి తన తండ్రి సినిమాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు కార్తికేయం.
Related image
`ఈగ` సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా `యుద్ధం శరణం` సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా `బాహుబలి-2`కు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పనిచేసిన కార్తికేయ ఆల్ రౌండర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.   గత కొంత కాలంగా పూజాప్రసాద్ ప్రేమిస్తున్న కార్తీకేయ పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకోబోతున్నాడు. సినిమాలతో పాటు కార్తికేయ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టాడు.

ఒక రెస్టారెంట్ కు సహ యజమానిగా ఉన్న కార్తికేయ....తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ లో నల్గొండ ఈగల్స్ కబడ్డీ టీమ్ కు ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రముఖ నటుడు జగపతిబాబుకు రాంప్రసాద్ అన్న అవుతారు.  ఇక కార్తికేయ  దర్శకులు రాజమౌళి సొంత కొడుకు కాదన్న విషయం తెలిసిందే. కానీ, రాజమౌళికి - కార్తికేయక మధ్య మంచి అనుబంధం ఉందని పలు వేదికలపై స్పష్టమైన సంగతి తెలిసిందే. '  


మరింత సమాచారం తెలుసుకోండి: