తెలుగు ఇండస్ట్రీలో ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన‘రంగస్థలం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.   చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.  తాజాగా మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.   డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం షూటింగ్ అజర్‌ బైజాన్‌లో జరుగుతోంది. 

ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  అయితే ఈ షెడ్యూల్ ఓ తేనెటీగలు ఉండే ఓ భారీ ఫామ్ హౌజ్ పక్కనే జరుపుతున్నారట.  ఒకవేళ గనక తేనటీగలు గనక చిత్రయూనిట్ పై ఎటాక్ చేస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది.  కాకపోతే అన్ని జాగ్రత్తలు తీసుకొని అక్కడ షూటింగ్ ఏర్పాట్లు చేశారని సమాచారం. 

ఈ విషయం గురించి రాంచరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.  తేనెటీగలు రేగి అందరినీ గాయపరిచే ప్రమాదం ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులందరూ తమ పనులని ఎంతో జాగ్రత్తగా చేసుకుపోతున్నారని ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: