సుకుమార్ ఈ పేరు చెబితే చాలు అందరూ క్రియేటివ్ జీనియస్ గా గుర్తు పడుతారు. `వన్` నేనొక్కడినే` తో డిజాస్టర్ అందించిన నాటి నుంచి మహేష్ కు భారీ సక్సెస్ ను అందించాలని కసితో ఉన్నాడు. ఏ హీరోకి కమిట్ మెంట్ ఇవ్వకుండా కేవలం మహేష్ కథపైనే కూర్చున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల బడ్టెట్ తో భారీ స్పాన్ తో తెరకెక్కించనున్నట్టు నిర్మాణ వర్గాల నుంచి లీకైంది. సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఈరేంజ్ లో ప్లాన్ చేసారంటే? కథ కూడా యూనిక్ గానే ఉంటుంది తెలుస్తోంది. సుకుమార్ కొన్ని కథలు సామాన్యుడ్ని మెప్పించేలా ఉంటాయి. మరికొన్ని అతీతంగానూ ఉంటాయి. అసామాన్యుడికి అందని విధంగా ఇంకొన్ని కథలుంటాయి.\
మరి ఇందులో మహేష్ కోసం ఎలాంటి కథను ఎంపిక చేసుకున్నాడో? కొద్ది రోజులు ఆగితే గాని తెలియదు. గతంలో మహేష్ తో సైక్లాజికల్ పాయింట్ తో తెరకెక్కించి `వన్` సినిమా డిజాస్టర్ అయింది. హాలీవుడ్ సినిమా `బోర్న్ ఐడెంటిటీ` స్ఫూర్తి తో తెరకెక్కిన సినిమా సామాన్యుడికి అర్ధం కాలేదు. ఈ నేపథ్యంలో అలాంటి కథలు జోలికి వెళ్లే అవకాశం లేదు. ఓ కొత్త పాయింట్ తోనే మహేష్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు `రంగస్థలం`తో భారీ హిట్ ఇచ్చాడు.