టాలివుడ్లో ఎపుడూ క్రేజీ కాంబినేషన్లకే పెద్ద పీట వేస్తారు. ఓ సినిమాతో హిట్ కొట్టిన జంట మళ్ళీ జట్టు కడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కాంబో మళ్ళీ రిపీట్ కావాలని కోరుకుంటారు. అలాంటి సూపర్ హిట్ కాంబో మరో మారు రాబోతోంది. తిరుగులేని హిట్ కొట్టాలన్న కసితో ఆ ఇద్దరూ కలవబోతున్నారు.



రాం చరణ్ లోని పెర్ఫార్మెన్స్ ని మరో కోణంలో చూపించి పెద్ద హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి చరణ్ తో లేటెస్ట్ గా మూవీకి ప్లాన్ చేశాడు. ఎవడు మూవీ ఇద్దరి కాంబోలో అప్పట్లో సెన్సేషనల్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు వీరిద్దరూ పనిచేసే అవకాశం  వచ్చింది.



ఈ మధ్యనే ఓ మాంచి స్టోరీ లైన్ ఒకటి తీసుకుని చరణ్ కి వంశీ వినిపించాడట. దానికి ఒకే చెప్పిన చరణ్ డెవలప్ చేయమన్నడని టాక్. ప్రస్తుతం వంశీ మహేష్ తో మహర్షి మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత చేయబోయేది చరణ్ మూవీయే. 



చరణ్ బాడీ లాంగ్వేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఎక్కడా తగ్గకుండా పకడ్బంధీగా ఓ పవర్ ఫుల్ స్టోరీ వంశీ రెడీ చేశాడట. అది సెట్స్ పైకి వచ్చేందుకు కొంత టైం పట్టొచ్చు. కానీ ఈ ఇద్దరి కలయికలో మరువలేని హిట్ మూవీ వస్తుందని మాత్రం గట్టిగా చెబుతున్నడు వంశీ. ఇది చరణ్ ఫ్యాన్స్ కి స్వీట్ న్యూసే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: