ప్రముఖ దర్శకులు సుకుమార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ అందాల భామ సమంత కాంబినేష్ లో వచ్చిన ‘రంతస్థలం’బ్లాక్ బస్టర్ అందుకుంది.  ఈ చిత్రంలో చిట్టిబాబు గా రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి.  ఇక సమంత పళ్లెటూరి పిల్లగా అద్భుతంగా నటించింది.  తాజాగా రాంచరణ్ మాస్ దర్శకులు బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. 

Image result for vamsi paidipally ram charan

 ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం పూర్తియిన తర్వాత  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో వంశీ పైడిపల్లికి ప్రత్యేకమైన స్థానం వున్న విషయం తెలిసిందే..గతంలో ఆయన చేసిన సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఆయన 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. షూటింగు దశలో వున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. 


 ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రంను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ మద్య వంశి పైడిపల్లి హీరో రాంచరణ్ కి ఒక లైన్ చెప్పాడట. లైన్ బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేయమని చరణ్ చెప్పినట్టుగా సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అల్లు అర్జున్, రాంచరణ్ నటించిన ‘ఎవడు’చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. రాజమౌళి ప్రాజెక్టు మధ్యలో గ్యాప్ దొరికితే వంశీ పైడిపల్లితో కలిసి సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో చరణ్ వున్నాడని అంటున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: