రెండురోజుల క్రితం జరిగిన హరికృష్ణ చివరి రోజు కార్యక్రమాలలో పాల్గొన్న బాలకృష్ణ జూనియర్ ల మధ్య సయోధ్యకు వారి కుటుంబ సభ్యుల రాయబారాలతో శుభం కార్డ్ పడినట్లుగా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. దీనితో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మింప పడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ను కూడ చూడాలని కలలు కంటున్నా జూనియర్ అభిమానుల కోరిక తీరబోతోంది అన్న వార్తల హడావిడి జరుగుతోంది.

హరికృష్ణ మరణంతో పూర్తిగా మారిపోయిన బాలయ్యతో కళ్యాణ్ రామ్ చేసిన రాయబారాలు ఫలించడంతో ఈ నిర్ణయాలు జరిగాయి అని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రను పోషిస్తున్న నేపధ్యంలో అతడు నటించే సన్నివేశాల షూటింగ్ మరి కొద్ది రోజులలో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.
Actor called up his uncle after returning from Spain and apparently apologised for their differences.
దీనికితోడు ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ కు ఒక అతిథి పాత్ర క్రియేట్ చేస్తారని తెలుస్తోంది. అయితే కేవలం రెండు మూడు నిముషాలు ఉండే ఈ అతిథి పాత్రను ఎన్టీఆర్ బయోపిక్ తో ఎలా లింక్ చేయాలి అన్న విషయాన్ని బాలయ్య క్రిష్ నిర్ణయానికి వదిలి వేసినట్లు టాక్. ఇది చాలదు అన్నట్లుగా బాలకృష్ణ జూనియర్ కు మరో వరం కూడ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

సెప్టెంబర్ 20న జరగబోతున్న ‘అరవింద సమేత’ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రావడానికి కళ్యాణ్ రామ్ చేసిన రాయబారంతో చివరిగా బాలయ్య అంగీకరించినట్లు టాక్. దీనితో ‘అరవింద సమేత’ ‘బాలకృష్ణ సమేత తారక రామ’ గా మారబోతోంది అంటూ ప్రచారం జోరు అందుకుంది. అయితే నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీరి కలయిక అయినా హరికృష్ణ మరణం రీత్యా ఈ ఫంక్షన్ ను ఎటువంటి ఆడంబరాలు లేకుండా సింపుల్ గా చేయమని బాలయ్య జూనియర్ ను కోరినట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: