వినాయకచవితి రోజున విడుదలకాబోతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈఫంక్షన్ కు అతిధులుగా నాగార్జున నానీలు హాజరు అయ్యారు. ఈ వేడుకలో మితిమీరిన ఉత్సాహంతో నాగార్జున అక్కినేని నట వారసత్వం పై చేసిన కామెంట్స్ ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామందిని ఆశ్చర్య పరిచాయి.

ప్రేమ కథలకు సంబంధించిన సినిమాలలోను వినోదాత్మక సినిమాలలోను హీరోగా నటించి అనేక ఘనవిజయాలు అందుకున్న అక్కినేని నాగేశ్వరరావు వారసత్వం తనకంటే తన కొడుకు నాగచైతన్యకు ఎక్కువగా వచ్చిందని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు నటనలో ఉండే చిలిపితనం తనకు పూర్తిగా రాలేదు కానీ తనకొడుకు నాగచైతన్యకు పూర్తిగా వచ్చింది అంటూ చైతూని ఆకాశంలోకి ఎత్తేశాడు నాగార్జున.
Shailaja Reddy Alludu first look
అంతేకాదు ఈసినిమాలో అత్తగా నటించిన రమ్యకృష్ణ నటన ‘బాహుబలి’ మూవీలోని శివగామి పాత్రను మించి ఉంటుందని ఈమూవీలో రమ్యకృష్ణ దర్పంతో నడుస్తూ ఉంటే ఎవరైనా ఆమె నటనకు అలా కళ్ళు అప్పగించి చూడాలసిందే అంటూ ‘శైలజా రెడ్డి’ అల్లుడు పై అంచనాలు పెంచేసాడు నాగార్జున. ఎప్పటి నుంచో అక్కినేని అభిమానులు తమ వద్ద నుంచి కోరుకుంటున్న ఒక మాస్ మసాలా సినిమాగా ‘శైలజా రెడ్డి’ ఉండబోతోంది అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు నాగార్జున. 

నాగార్జున పొగడ్తలు తరువాత మైక్ ముందుకు వచ్చిన నాగచైతన్య మాట్లాడుతూ ‘అభిమానులే తన బలం అభిమానులే తన బలహీనత’ అంటూ సోషల్ మీడియాలో తన మూవీని విపరీతంగా ప్రమోట్ చేస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేసాడు. తాను సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండకపోయినా అభిమానులు వ్యక్త పరిచే ప్రతి అభిప్రాయాన్ని తెలుసుకుని తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న తన కోరికను తీర్చవలసిందిగా పదేపదే తన అభిమానులను అభ్యర్ధించాడు నాగచైతన్య..  



మరింత సమాచారం తెలుసుకోండి: