తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాన్ తర్వాత అల్లు అర్జున్, రాంచరణ్ లు హీరోలుగా తమ సత్తా చాటుతున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, చిరంజీవి సోదరి తనయుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా హీరోగా సెట్ కావడానికి కష్టాలు పడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాన్ ‘జనసేన’ పార్టీ స్థాపించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అనుకున్న విషయం సాధించలేదు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ తర్వాత ఏ దర్శకుడి తో కమిట్ అవుతారో ఇప్పటి వరకు తెలియదు..అసలు ఆయన చిత్రాలు ఉంటాయో లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కానీ ఈ మద్య సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఆనంద పడే ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పవన్ మరికొన్ని రోజుల్లో వెండితెరపై కనిపించనున్నారట.
'గోపాల గోపాల', 'కాటమరాయుడు' చిత్రాల దర్శకుడు డాలి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించి కనువిందు చేయబోతున్నట్లు సమాచారం. పవన్ మేనల్లుడు సినిమాని డైరెక్ట్ చేస్తున్న డాలికి పవన్తోను మంచి సాన్నిహిత్యం ఉన్నందున ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేయమని పవర్ స్టార్ని కోరాడట. మేనల్లుడి కోసం పవన్ వారి అభ్యర్ధనని అంగీకరించారట. అంటే త్వరలో పవన్ వెండితెరపై మెరిసి మురిపించున్నడన్నమాట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.