నాగచైతన్య   ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగార్జున ఇచ్చిన స్పీచ్ విషయంలో నాగచైతన్య అభిమానుల నుండి  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికికారణం నిన్న జరిగిన ఈ మూవీ ఫంక్షన్ లో  ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా పేరును నాగార్జున సరిగ్గా చెప్పకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని  కలిగిస్తే చైతు అభిమానులకు కోపం కలిగించింది అని వార్తలు వస్తున్నాయి. 
అక్కినేని అభిమాని
నిన్నటి ఫంక్షన్ లో నాగార్జున మాట్లాడిన ఏడు నిమిషాల సమయంలో పలుసార్లు ఈసినిమా టైటిల్ ను చెప్పిన నాగార్జున ప్రతిసారి కూడ తప్పుగానే చెప్పాడు. ఒక్కసారి కూడ నాగార్జున పూర్తిగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ అంటూ చెప్పక పోవడంతో చాలమంది ఈమూవీ టైటిల్ ను పలకడంలో నాగార్జున కన్ఫ్యూజ్ అవుతున్నాడా అంటూ నిన్నటిరోజు కార్యక్రమానికి వచ్చిన చాలమంది తమ పక్కన కూర్చున్న వారితో  కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
ఆయన ఒక్కడినే
నాగార్జున ఈసినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ శైలజా రెడ్డి గారి అల్లుడు శైలజా  అల్లుడు శైలజా  రెడ్డి అల్లుడుగారు అంటూ రకరకాలుగా మార్చి మాట్లాడటం నాగచైతన్య అభిమాలకే గందర గోళంగా తయారు అయింది. దీనితో కొందరు కొడుకు సినిమా వేడుకకు వచ్చి ఇలా టైటిల్ విషయంలో గందరగోళంగా మాట్లాడటం ఏమిటి అంటూ జోక్ చేసుకున్నట్లు సమాచారం. అయితే వాస్తవానికి నాగార్జున  టైటిల్ ను మర్చిపోయి ఇలా మాట్లాడి ఉంటాడా లేదంటే ఇలా మాట్లాడటం వెనుక మరి ఏమైనా వ్యూహాలు నాగార్జున మనసులో ఉన్నాయా అంటూ మరికొందరు కామెంట్స్  చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 రమ్య అంటే
అయితే ఇదే  ప్రీ రిలీజ్ వేడుకులో పాల్గొన్న ఇతర స్టార్స్ అందరు నానితో సహా ఇబ్బంది లేకుండా టైటిల్ ను పలకడం ఒక్క నాగార్జున మాత్రమే తప్పుగా పలకడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాలను పరిశీలించిన కొందరు నాగచైతన్య నటించిన గత చిత్రాల టైటిల్స్ ను నాగార్జున మరిచిపోతే పర్వాలేదు కానీ రిలీజ్ కు సిద్ధమై నాగార్జున ఎంతో ఆశలు పెట్టుకున్న ఈసినిమా టైటిల్ కూడ మరిచిపోవడం ఎంటి అంటూ ఇది అంతా నాగార్జున కన్ఫ్యూజన్ అనుకోవాలా లేక మతిమరుపు అనుకోవాలా అని కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: