గత కొన్ని రోజులుగా బాలీవుడ్ బ్యూటీ  కంగనారనౌత్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మణికర్ణిక కు రక రకాల కష్టాలు వచ్చి పడుతున్నాయి.   వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను మొదట క్రిష్ తీసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తుండటంతో..బిజీ షెడ్యూల్ వల్ల మణికర్ణిక టీం నుంచి తప్పుకున్నాడు క్రిష్. తాజాగా  కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `మణికర్ణిక` కు   కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్నాడు.

Manikarnika movie LANDS IN FRESH TROUBLE

అయితే ‘మణికర్ణిక’  రెస్పాన్సిబిలిటీని కంగనా  తీసుకుంది. ఆ క్రమంలోనే సోనూసూద్ తో గొడవొచ్చింది. అది నచ్చని సోనూ నీకు... నాకు కుదరదంటూ తప్పుకున్నాడు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించాడు.  గత కొంత కాలంగా  షూటింగ్ ప్లానింగ్ ప్రకారం జరగకపోవడంతో ఖర్చు అంతకంతకు పెరిగిపోతోంది. ఇది నిర్మాతల్ని బెంబేలెత్తించిందని తెలుస్తోంది. తాజాగా చిత్ర నిర్మాత సంజయ్ కుట్టి కూడా మణికర్ణిక చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


 వివిధ కారణాల వల్ల మణికర్ణిక షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండటం వల్ల సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువైందట...  70 కోట్లలో అనుకున్న `మణికర్ణిక` ఇప్పుడు 100 కోట్లు ఖర్చు అవుతుందని కంగన అడ్డగోలుతనంతో చిక్కులొచ్చి పడ్డాయని నిర్మాత భావిస్తున్నారట. కంగన దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక పెరిగిన బడ్జెట్ని కొత్తగా రివైజ్ చేసి మళ్లీ చెప్పిందిట. ఈ నేపథ్యంలో నిర్మాణ బాధ్యతల్ని కొత్త వారు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే వాళ్లెవరన్నది ఇంకా బయటకు రాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: