యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇయర్ దసరా బరిలో దిగుతున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.


సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. అయితే సినిమాలో బిగ్ బి అమితాబ్ కెమియో ఉందని అంటున్నారు. తెలుగులో అమితాబ్ ఒకటి రెండు సినిమాల్లోనే కనిపించారు. నాగార్జున మనంలో గెస్ట్ రోల్ చేసిన అమితాబ్ ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాలో నరసింహా రెడ్డి గురువుగా కనిపిస్తున్నారు. 


అరవింద సమేతలో అమితాబ్ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఎన్.టి.ఆర్ తో అమితాబ్ కాంబో ఫ్యాన్స్ కు క్రేజీగా మారింది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి సినిమాలో అమితాబ్ ఉన్నాడని కొందరు అంటున్నారు.


ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న అరవింద సమేత సినిమాలో చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ మాస్ హీరోగా కనిపితున్నాడు. టీజర్ ఇంప్రెస్ చేయగా సెప్టెంబర్ 22న జరిగే ఆడియోలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారట. మరి అమితాబ్ ఉన్నది లేనిది ఈలోగా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: