యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే.  గతంలో ఎన్టీఆర్ ఆది, దమ్ము చిత్రాలతో తన సత్తా చాటాడు.  తాజాగా ఇప్పుడు మరోసారి ఫ్యాక్షన్ తరహా చిత్రం ‘అరవింద సమేత’తో వస్తున్నాడు.  ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆ మద్య రిలీజ్ అయ్యింది. 


ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ..రౌడీలను వెంటపడి తరుముతున్న సీన్ చూస్తుంటే..ఏ రేంజ్ లో యాక్షన్ ఉందో అర్థం అవుతుంది. అయితే ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మృతి తెలుగు ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచింది.  దాంతో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటాడా! అన్న సందేహాలు కలిగాయి..కానీ ఆయన యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అరవింద సమేత సినిమా షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

Image result for ARAVINDA SAMETHA

ఈ చిత్రానికి సంబంధించిన  ప్రమోషన్‌ను జోరుగా ప్రారంభించాలని నిర్ణయించారు. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లను, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటి మీడియాకు వెల్లడించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  ఈ చిత్రంలో అతిధి పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ కనిపించబోతున్నాడట.  గతంలో ‘మనం’ చిత్రంలో కనిపించిన అమితాబ్..తాజాగా మెగాస్టార్ నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ క్రమంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింత సమేత’లో కూడా గెస్ట్ రోల్ ఉన్నట్లు సమాచారం. పాత్రకు సంబంధించిన వివరాలను చాలా సీక్రెట్‌గా పెట్టినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: