విజయ్ దేవరకొండ మ్యానియా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నేపధ్యంలో త్వరలో విడుదల కాబోతున్న ‘నోటా’ మూవీ పై ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో బాగా పెరిగి పోయింది. ‘గీత గోవిందం' సూపర్ సక్సస్ తో రాబోతున్న ‘నోటా’ మూవీ కూడ అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలతో ఈమూవీ బిజినెస్ ప్రస్తుతం చుక్కలు తాకుతోంది.
అయితే 'నోటా' మూవీ రాజకీయ నేపథ్యంలో సాగే సీరియస్ డ్రామా. అదీకాకుండా ఈమూవీని తమిళంలో తీసి తెలుగులో డబ్ చేస్తున్నారు. దీనితో ఈమూవీ పై తమిళ వాసన ఎక్కువగా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. అయినా ఈ విషయాలు ఏమీ పట్టించు కోకుండా ‘నోటా’ నిర్మాతల దగ్గరకి బయ్యర్లు క్యూ కడుతున్నారు.
ఈ డిమాండ్ ను పసికట్టిన ఈమూవీ నిర్మాతలు ‘నోటా’ తెలుగు హక్కులను 30 కోట్ల పైగా అడుగుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ‘నోటా’ కు 20 కోట్లు ఇవ్వడానికి పలువురు సిద్ధంగా ఉన్నా ఈ ఆఫర్స్ ను ఈమూవీ నిర్మాతలు తిరస్కరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో 25 కోట్ల వరకు రిస్క్ చేస్తామని కొందరు చెపుతున్నా ఆమాటలను కూడ నోటా నిర్మాతలు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.
దీనితో ‘నోటా’ నిర్మాతల అత్యాసకి విజయ్ దేవరకొండ బలి కాబోతున్నాడు అంటూ ప్రస్తుతం కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీకి దర్సకత్వం వహించిన తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ ఈమూవీని అంతా ఒక తమిళ డ్రామాలా నడిపిమ్చినట్లు టాక్. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ నటించని కొత్త తరహా పాత్ర ‘నోటా’ లో కనిపించినా ప్రస్తుతం విజయ్ సినిమాల పై అంచనాలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో ఏమైనా తేడాలు వస్తే అత్యంత భారీ రేట్లకు ‘నోటా’ తెలుగు వర్షన్ ను కొనుక్కున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది అన్న ప్రచారం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది..