తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మరికొద్ది రోజుల్లో ముగియబోతున్న విషయం తెలిసిందే.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 మొదలైన కొన్ని ఎపిసోడ్స్ వరకు పరమ బోరింగ్ తలపించింది.  ఇందులో కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన సంజన, గణేష్, నూతన్ నాయులు స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తారనుకున్నారు. కానీ మొదటి వారమే సంజన ఎలిమినేట్ అయ్యింది.  కొన్ని వారాల్లోనే నూతన్ నాయుడు ఎలిమినేట్ కావడం..మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం..మళ్లీ ఎలిమినేట్ కావడం పెద్దగా స్పెషల్ అనిపించలేదు.  కాకపోతే గణేష్ మాత్రం దాదాపు డెబ్బైరోజుల వరకు సెలబ్రెటీలతో కలిసి ఉన్నాడు. గణేష్ ఎలిమినేట్ అయ్యాడు..గత ఆదివారం యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయ్యింది. 


ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో మరో స్పెషల్ ఏంటంటే.. కౌశల్‌ ఆర్మీ. బిగ్ బాస్ లో కౌశల్‌ ఆర్మీ ఈ సీజన్‌ మొత్తంను లీడ్‌ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కౌశల్‌ అభిమానులు ఎవరు ఎలిమినేట్‌ కావాలంటూ పిలుపునిస్తే వారు ఎలిమినేట్‌ అయ్యారు.  కౌశల్‌తో గొడవ పడ్డవారు ఒక్కరు ఒక్కరుగా వెళ్లి పోయారు. ఇక బిగ్ బాస్ సీజన్ ఫైనల్‌ విజేత ఎవరు అనే టైం దగ్గరకు వచ్చింది.మొదటి సీజన్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ రోజు ముఖ్య అతిథిగా ఒక స్టార్‌ హీరో రాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. 

Related image

కానీ ఎన్టీఆర్ ఒక స్టార్ హీరో కావడంతో అతనికి గెస్ట్ గా వెళ్లడానికి ఇతర స్టార్ హీరోలు పెద్దగా సుముఖత చూపించలేదు.  కానీ ఇప్పడు సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారట. ఆ  గెస్ట్‌ మరెవ్వరో కాదు కింగ్‌ నాగార్జున. మా టీవీలో ఒకప్పుడు సహ భాగస్వామిగా ఉన్న నాగార్జున ఇప్పటికి కూడా స్టార్‌ మాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు.

Image result for nagarjuna

అందుకే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఫైనల్‌ ఎపిసోడ్‌లో కనిపించాలని నిర్ణయించుకున్నాడు.  నాగార్జున మరియు నానిలు కలిసి ఫైనల్‌ విజేత ఎవరు అనే విషయాన్ని ప్రకటించి షీల్డ్‌ మరియు క్యాష్‌ ప్రైజ్‌ను ఇవ్వబోతున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరు కలిసి నటించిన దేవదాస్ సినిమా ప్రమోషన్ కూడా కలిసి వస్తుందని అందుకే నాగ్ స్పెషల్ గెస్ట్ గా పిలవడం ఆంతర్యం అయి ఉండొచ్చని ఫిలిమ్ వర్గాల టాక్. 




మరింత సమాచారం తెలుసుకోండి: