ఈ మద్య పరభాష నుంచి వచ్చిన హీరోయిన్లు ఒకటీ రెండు చిత్రాలతో ఒక్కసారే స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్తున్నారు.  శైలజారెడ్డి,నేను లోకల్, మహానటితో కీర్తి సురేష్, ఫిదా తో సాయిపల్లవి తాజాగా ఛలో, గీతాగోవిందం చిత్రంతో రష్మిక మందన అద్భుతమైన క్రేజ్ తెచ్చుకున్నారు.  అయితే ఛలో చిత్రానికి ముందు రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలసిందే.  తాజాగా హీరోయిన్ రష్మిక మందానా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఇన్నాళ్లూ అవునా...కాదా? అనే కన్ఫర్మేషన్ లేకపోయినా రష్మిక- రక్షిత్ ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.  

Geetha Govindam actress Rashmika Mandanna breaks up with fiance Rakshit Shetty

కిరిక్‌పార్టీ చిత్ర సమయంలో ఈ జంట ప్రేమలో పడ్డారు. అనంతరం నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికోసం వేచిచూస్తున్నారు. ఈలోగా తెలుగులో ఛలో, గీత గోవిందం చిత్రాల వరుస విజయాలతో రష్మిక బిజీగా మారింది.  గీత గోవిందం చిత్రంతో రష్మిక దశ తిరిగి పోయింది. ప్రస్తుతం ఈమెకు కోటి రూపాయలకు మించి పారితోషికం ఇచ్చి మరీ తమ సినిమాల్లో నటింపజేసేందుకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏ హీరోయిన్‌ కూడా పెళ్లి గురించి ఆలోచించదు. అందరిలాగే రష్మిక కూడా పెళ్లి ఇప్పుడు వద్దని నిర్ణయించుకుంది.


 గతంలో కూడా ఇలాగే పుకార్లు రావడంతో ఆమె స్వయంగా వాటిని ఖండించింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ వార్త వైరల్ అవుతోంది. 22 ఏళ్ల రష్మిక ప్రస్తుతం తన సినీ కెరీర్‌పై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. రష్మిక సన్నిహితుల సమాచారం మేరకే ఈ విషయాన్ని వెల్లడించినట్లు కూడా ఆ పత్రిక పేర్కొంది. కెరీర్ కోసం తన తల్లిదండ్రులతో చర్చించి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మరోవైపు రష్మిక  తల్లి సుమన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన కుమార్తె నిశ్చితార్థం రద్దయిందని చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తామంతా చాలా డిస్టర్బ్ అయ్యామని... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ జీవితం చాలా ముఖ్యమని... ఎదుటి వ్యక్తి బాధ పెడితే ఎవరికీ ఇష్టం ఉండదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: