సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలు తీయాలని అనేకమంది క్రేజీ దర్శకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈలిస్టులో ఇప్పుడు మొదటి వరసలో ఉన్నది ‘అర్జున్ రెడ్డి’ మూవీ డైరెక్టర్ వంగా సందీప్ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఈ నేపధ్యంలో కొద్ది రోజుల క్రితం మహేష్ వంగా సందీప్ చెప్పిన కథకు ఓకె చేసాడు అని వస్తున్న వార్తల పై మహేష్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్.
Mahesh Babu in Bharat Ane Nenu
దీనికి కారణం ప్రస్తుతం మహేష్ తన సినిమాల ఎంపిక విషయంలో అనుసరిస్తున్న కొత్త పద్ధతులు.  ప్రస్తుతం చాలమంది దర్శకులు ఒక హీరోకు కథ చెప్పే విషయంలో లైన్ చెబితే లేదా అరగంట నెరేషన్ ఇస్తే సినిమా చేసే పద్దతికి మహేష్ పూర్తిగా స్వస్తి చెప్పాడట. 
Buzz: Bharat Ane Nenu Also Inspired From Largo Winch?
అంతేకాదు మహేష్ తనతో సినిమాలు చేయాలి అనుకునే దర్శకులు ఒక అరగంట కథ చెపితే సరిపోదనీ పూర్తి స్క్రిప్ట్ ఎవరు చెపితే వారితోనే తన సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కేవలం తనకు ఒక అరగంట కథ చెప్పిన సందీప్ వంగాకు కూడ మహేష్ సున్నితంగా చెప్పినట్లు టాక్. 
Arjun Reddy Director Sandeep Reddy Vanga Greedy to Do in Hindi
అయితే ఈవిషయాలను అర్ధం చేసుకోకుండా సందీప్ తన మూవీ మహేష్ తో ఉంటుందనీ ఆమూవీకి నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరిస్తాడని లీకులు ఇవ్వడం మహేష్ కు తీవ్ర అసంతృప్తి కలిగించినట్లు సమాచారం. దీనితో మహేష్ సందీప్ ను పిలిపించుకుని జరుగుతున్న విషయాలు అతడి దృష్టికి తీసుకు వచ్చి సందీప్ కు పెద్ద క్లాస్ పీకినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈవిశాయాల పై మహేష్ భార్య నమ్రత కూడ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఇంకా సినిమా ఒకే కాకుండానే మహేష్ ఆగ్రహానికి గురి కావడం పట్ల ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు తల పట్టుకుంటున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: