‘శైలజా రెడ్డి అల్లుడు’ సూపర్ సక్సస్ తో మాస్ హీరోగా మారిపోదామని కలలు కంటున్న నాగచైతన్యను ఆమూవీ రిజల్ట్ ఇంకా తెలియకుండానే మిల్కీ బ్యూటీ తమన్నా చైతన్యను రోడ్డు పై నిలబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈవిషయం అంతా చైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ సినిమాకు సంబంధించింది.
ప్రస్తుతం సినిమాలు లేక అవస్థ పడుతున్న తమన్నా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు తనను తాను గుర్తుకు చేసుకుంటోంది. అయితే పేరుకు ఐటమ్ సాంగ్స్ అయినా తమన్నాకు ఉన్న ఇమేజ్ రీత్యా తాను చేస్తున్న ప్రతి ఐటమ్ సాంగ్ కు సుమారు 30 లక్షల వరకు పారితోషికం తీసుకుంటూ తాను చేస్తున్నవి ఐటమ్ సాంగ్ లు కావు స్పెషల్ సాంగ్స్ అంటూ కొత్త నిర్వచనాలు ఇస్తోంది.
ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ‘సవ్యసాచి’ సినిమా కోసం తనన్నా నాగచైతన్యలపై ఒక ప్రత్యేకమైన ఐటమ్ సాంగ్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. దీనికోసం 1990 ప్రాంతంలో వచ్చిన నాగార్జున ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు’ అనే పాటకు అదే ట్యూన్ తో రీమిక్స్ సాంగ్ గా ఇప్పుడు ‘సవ్యసాచి’ సినిమాలో చూపించబోతున్నారు.
వాస్తవానికి ఈపాటను ఎవరైనా యంగ్ హీరోయిన్ తో తీయాలని ‘సవ్యసాచి’ నిర్మాతలు భావించినా తమన్నా చైతన్యల కాంబినేషన్ బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో సెంటిమెంట్ రీత్యా తిరిగి తమన్నాకే ఓటు వేసినట్లు టాక్. ‘శైలజా రెడ్డి’ హడావిడి పూర్తి అవుతోంది కాబట్టి చైతన్య ఇప్పుడు తన దృష్టి అంతా ‘సవ్యసాచి’ పై పెట్టి ఒకే సంవత్సరం వరసగా రెండు హిట్లు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు..