తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ దర్శకులు శంకర్ కాంబినేషన్ లో రోబో చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 2.0 అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడ్తూ రేపు వినాయక చవితి సందర్భంగా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచ మంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 2.ఓ. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలలో దాదాపు 543 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందింది.
నవంబర్ 29న విడుదల నిశ్చయించారు. సినిమా మొత్తాన్ని 3డీ కెమెరాలతో తెరకెక్కించిన శంకర్ టీజర్ని కూడా 3డీ ఫార్మాట్లోనే విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ థియేటర్లలో ప్రీమియర్గా ప్రదర్శించనున్నారు.
ఇందుకోసం దగ్గర్లోని పీవీఆర్, సత్యం థియేటర్స్లో 3డీ టీజర్ని ఉచితంగా చూడవచ్చని శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కాకపోతే ఇందుకోసం ప్రేక్షకులు చేయాల్సిన పనేంటంటే.. 90999 49466 అనే నెంబర్కు మిస్డ్కాల్ ఇచ్చి ఉచిత టికెట్ను బుక్ చేసుకోవడం. మరి ఇంకెందుకు ఆలస్యం మిస్డ్ కాల్ ఇచ్చి టీజర్ని ఉచితంగా థియేటర్లో చూసే అవకాశం పొందండి.