ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మెప్పు పొంది రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన  దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కుతుంది.  తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. 


ఈ మేరకు ఆ సినిమా రూపకర్తలు విడుదల తేదీని ప్రకటించారు.  వినాయకచవితి శుభాకాంక్షలను తెలుపుతూ ఆ సినిమా విడుదల తేదీని తెలిపారు. ఆయన చేసిన పాదయాత్ర .. ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లనే ఆయన బయోపిక్ గా 'యాత్ర' రూపొందుతోంది. వైఎస్ గా మమ్ముట్టి నటిస్తోన్న ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 


ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన ‘యాత్ర’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను వైఎస్ జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ కి .. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్ కి  అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా అన్నివర్గాల వారి ఆదరణను పొందుతుందనే నమ్మకంతో వైఎస్ అభిమానులు వున్నారు.       


మరింత సమాచారం తెలుసుకోండి: