‘బాహుబలి’ తో ప్రపపంచ సినిమారంగ దృష్టి  ఆకర్షించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాడి సత్తాను చాటిన రాజమౌళి ప్రారంభించిన కొత్త తరహా బిజినెస్ ఇప్పడు సంచలనాలుసృష్టిస్తోంది. ఎవరు ఊహించని విధంగా రాజమౌళి మన దేశీయ క్రీడ అయిన కబడ్డీద్వారా కోట్లు సంపాధించాలని వేసిన  స్కెచ్ ఇప్పుడు టాపిక్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. 
SS Rajamouli. File Photo/News 18
 మన దేశీయ క్రీడ అని ప్రోత్సహిద్దామనుకున్నాడో లేదా ఆఫ్‌ బీట్ ప్రొఫెషన్‌ గా బాగుందనుకున్నాడో లేక కొడుకు అభిరుచితో ఏకీభవిద్దామనుకున్నాడో తెలియదుకాని జక్కన్న దృష్టి ఇప్పుడు ‘కబడ్డీ’ ఆట పై పడింది. నేను ‘పక్కా లోకల్’ అంటూ నల్లగొండ ఈగల్స్ క‌బ‌డ్డీ జ‌ట్టును కొనేసాడు రాజమౌళి. 
 baahubali 2, ss rajamouli,
ఇతడి ఎంట్రీతో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్‌2 విపరీతంగా ప్రమోట్ అవుతోంది. నిర్మాత సాయి కొర్రపాటి కొడుకు కార్తీకేయలతో కలిసి రాజమౌళి చేస్తున్న ప్రమోషన్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తన సొంత టీమ్‌తో పాటు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ మొత్తానికీ ఈ ప్రమోషన్ మంచి ఊపునిస్తోంది. 
Rajamouli's second magnup opus
రాజమౌళి తన క్రియేటివిటీ మొత్తాన్ని కుమ్మరించి టీమ్ ప్రమోషన్‌ ని సినిమాటిక్‌ గా చేయడంతో పాటు ఓ థీమ్ సాంగ్‌ని కూడా రిలీజ్ చేశారు. ఈ నెల 14నుంచి 16రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్‌ 2లో మొత్తం 8 జ‌ట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే అందరి దృష్టి రాజమౌళి కొనుక్కున్న ‘నల్గొండ ఈగల్స్’ జట్టు మీదే వున్నాయి. కబడ్డీ ప్రేమికులతో పాటు ఫిలింనగర్ వర్గాలు సైతం ఇప్పుడు సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. దర్శకత్వం వహించే సినిమాల విషయంలోనే కాదు తాను చేపట్టే వ్యాపారాల విషయంలో కూడ రాజమౌళి అనుసరించే వ్యూహాలు చాల విభిన్నం



మరింత సమాచారం తెలుసుకోండి: