సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


ఇక ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత కూడా సందీప్ వంగతో సినిమా లైన్ లో పెట్టాడు. ఇకనుండి సినిమా కథల విషయంలో మహేష్ డెశిషన్ మార్చుకున్నాడట. కేవలం లైన్ చెప్పి ఒప్పించడం కన్నా ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చే డైరక్టర్స్ కే ఓటేస్తున్నాడట.


లైన్ విని బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల విషయంలో మోసపోయిన మహేష్ ఈసారి ఫుల్ స్క్రిప్ట్ తెచ్చి వినిపిస్తేనే డైరక్టర్స్ కు ఓకే చెబుతాడని తెలుస్తుంది. ముందు కథ నమ్రత వింటుందట. ఆ తర్వాత మహేష్ దగ్గరకు తీసుకెళ్తుందట. నమ్రతకే కథ నచ్చకుంటే వెనక్కి పంపిస్తుందట.


మహర్షి సినిమాలో మహేష్ మేకోవర్ క్రేజీగా మారింది. ఇక సుకుమార్ తో 1 నేనొక్కడినే ఫెయిల్యూర్ కాగా ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టేలా వర్క్ అవుట్ చేస్తున్నారు. మరి రూల్స్ మార్చేసిన మహేష్ ఇకనుండైనా సినిమాలు సూపర్ హిట్లు కొడతాడో లేదో చూడాలి. ఫ్యాన్స్ కు వరుస హిట్లు ఇచ్చేందుకే మహేష్ ఈ కొత్త డెశిషన్ తీసుకున్నాడని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: