సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో 2.0 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘రోబో’ మూవీకి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ను... వినాయక చవితి సందర్భంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబరు 13న విడుదల చేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. నిన్న ఉదయం '2.0' టీజర్ విడుదల కాగా, ఇప్పుడది సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. కేవలం 9 గంటల వ్యవధిలో 1.40 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సినిమా, 20 గంటలకెల్లా 3 కోట్ల వ్యూస్ ను దాటింది.
ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు కళ్ళు కాచేలా ఎదురు చూశారు. 3డి కెమెరాలతో చిత్రీకరించడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది చిత్రబృందం తెలుపుతూ వచ్చింది. మొత్తానికి వినాయక చవితి వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ఈ సినిమా 3డీ టీజర్ను విడుదల చేశారు. థియేటర్లలో ఈ టీజర్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
టీజర్ తమిళ, తెలుగు, హిందీ బాషలలో ఏకకాలంలో విడుదల చేశారు. తెలుగులో 5,069,230 , తమిళ్లో 9,341,840, హిందీ 10,231,367 వ్యూస్ సాధించింది. దీంతో ‘చిట్టి’ మరోసారి విజృంభించాడని... టీజర్తోనే అదరగొట్టి అంచనాలు పెంచేస్తున్నాడంటూ తలైవా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే రూ. 540 కోట్లు ఖర్చు కాగా, మొత్తం బడ్జెట్ రూ. 1000 కోట్లని అంచనా.