తెలుగు ఇండస్ట్రీలో టెంపర్ చిత్రంతో వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆ తాజాగా మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింత సమేత వీర రాఘవ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదట్లో కాస్త ఆలస్యం అయినా..ఫస్ట్ లుక్ తర్వాత షరవేగంగా జరుగుతుంది. ఆ మద్య ఈ చిత్రం నుంచి కొన్ని లీకేజ్ లు రావడంతో దర్శకులు త్రివిక్రమ్ చాలా సీరియస్ అయ్యారు..టీమ్ ని లోనికి సెల్ ఫోన్ తీసుకు రావొద్దని ఆజ్ఞలు కూడా జారీ చేశారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయిన తర్వాత ‘అరవింద సమేత’పై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. అంతా సవ్యంగా సాగుతుందన్న సమయంలో ఎన్టీఆర్ తండ్రి నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఈ చిత్రం షూటింగ్ ఆగుతుందని..అనుకున్న సమయానికి విడుదల కాదని రక రకాల రూమర్లు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ..ఈ నెల మొదటి రోజు నుంచి షూటింగ్ బిజీలో పడిపోయారు.
తన తండ్రి మరణ వార్తతో అంతా షాక్ లో ఉన్నామని..కానీ నిర్మాతలకు నష్టం వాటిల్లే విధంగా తాను ప్రవర్తించనని అందుకే షూటింగ్ లో పాల్గొంటున్నానని అన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం కొత్త పోస్టర్ విడుదలైంది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈ చిత్రం కొత్త పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓ ట్వీట్ లో పేర్కొంది.
ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా హ్యాండమ్స్ గా కనిపిస్తున్నారు. ‘అరవింద సమేత’ ఆడియో ఆల్బమ్ ను ఈ నెల 20న విడుదల చేస్తామని పేర్కొంది. ఈ వారంలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తెలియజేస్తామని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెలిపింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.