ప్రస్తుతం తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. ఒక్క వారంలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న విషయం తెలిపోనుంది. బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్టింగ్ గా ఉన్నారు. పదిహేడు మంది కంటిస్టెంట్లలో ముగ్గురు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చారు. సంజన, నూతన్ నాయుడు, గణేష్..అయితే ఈ ముగ్గురు ప్రస్తతం ఎలిమినేట్ అయ్యారు. గత కొంత కాలంగా బిగ్ బాస్ పై ఎన్నో రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఇటీవల తరచు వార్తల్లో ఉన్న మాధవీలత.. ‘బిగ్బాస్’ తెలుగు సీజన్-2లో అవకాశాన్ని జారవిడుచుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు లో బిగ్ బాస్ సీజన్ మొదలైప్పటి నుంచి మిస్ కాకుండా చూడటమే కాకుండా, తాజాగా ఓ రివ్యూ కూడా తన పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా బిగ్బాస్ హౌస్మేట్స్కు రేటింగ్ ఇచ్చింది. ‘బిగ్బాస్’ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో హౌస్మేట్స్ కుటుంబ సభ్యులను ‘రిమోట్ కంట్రోల్’ టాస్క్ ద్వారా లోపలికి పంపిన సంగతి తెలిసిందే. అయితే కుటుంబ సభ్యులను కలుసుకున్న హౌజ్ మెట్స్ ఎంతో ఆనందించారని..ఈ టాస్క్ మాధవీలతకు చాలా బాగా నచ్చిందట.
ముఖ్యంగా కౌశల్ తన పిల్లలను కలిసే దృశ్యాలు మనస్సును హత్తుకున్నాయని, సినిమా స్టైల్లో ఎడిట్ చేసి చూపించారని మాధవీలత పేర్కొంది. మరో హౌస్మేట్ తనీష్ గురించి మాట్లాడుతూ... ‘బేసిక్గా వాడు నాకు నచ్చడు. వాడి ఆలోచన విధానం 90 శాతం తప్పు, 10 శాతం బెటర్. అయితే, కౌశల్ పాపను చూసిన తర్వాత తనీష్.. మీకు నాకు ఎన్ని ఉన్నా మీ పాప క్యూట్గా ఉంది.
దాని కోసం మీ ఇంటికి వస్తాను అన్నాడు. అదీ హార్ట్ఫుల్గా అన్నాడు. ఇక తనీష్ తమ్ముడు.. తన అన్నకు శత్రువైతే నాకూ శత్రువే, నా అన్నకు అమ్మ అయితే నాకూ అమ్మే అనే టైప్. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా బయ్యా? దీప్తి తన భర్త చెప్పినట్లు తనీష్తో రిలేషన్ కోసం పెట్టే ఆరాటంలో పది శాతం ఆడియన్స్ కోసం పెడితే స్వీట్ హార్ట్ అయ్యేది అని తెలిపింది.