టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందాలతో యువత మనసు దోచిన హీరోయిన్ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తల్లి, అత్త పాత్రల్లో నటిస్తున్నారు.  హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ప్రముఖ దర్శకులు కృష్ణ వంశిని పెళ్లి చేసుకున్నారు..వీరికి ఒక బాబు.  సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత రమ్యకృష్ణకు ఎన్నో అద్భుతమైన పాత్రలు లభించాయి.  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘నరసింహ’ చిత్రంలో నీలాంభరి పాత్రలో ఎంతో పవర్ ఫుల్ గా నటించింది.  ఆ తర్వాత రాజమౌళి తీసిన బాహుబలి సీరీస్ లో శివగామిగా నటించి మెప్పించింది.  ఈ చిత్రంతో రమ్యకృష్ణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.  తాజాగా రమ్యకృష్ణ మరో సారి తన పాత్రతో అందరినీ మెప్పించింది.  


 నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ కాంబినేషన్లో రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటించిన 'శైలజారెడ్డి' అల్లుడు చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా విజయం పట్ల రమ్యకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  నేడు రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘శైలజారెడ్డి అల్లుడు’ విజయం తనకు ఎంతో సంతోషం ఇచ్చిందని..పుట్టిన రోజు సందర్భంగా ఒక సూపర్ హిట్ కొట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ చిత్రం కోసం అందరూ చిత్తశుద్ధితో పని చేశారని రమ్యకృష్ణ తెలిపారు.
Image result for shailaja reddy alludu ramya krishna
ఈ సినిమాను చూసిన వారంతా తన పాత్ర గురించి మాట్లాడుతుండటం సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.  దర్శకుడు మారుతి తన పాత్ర ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దారని..అల్లుడు గా నాగ చైతన్య కూడా అద్భుతంగా నటించి మెప్పించాడని అన్నారు. ఈ చిత్రంలో అత్త పాత్ర రెగ్యులర్ గా ఉండదని, ఎప్పుడూ చూసే అత్తాఅల్లుళ్ల మధ్య రొటీన్ కామెడీ ఉండదని చెప్పారు. ఈ సినిమా స్వీట్ సర్ ప్రైజ్ లా ఉంటుందని తెలిపారు.  నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న రమ్యకృష్ణకు ఏపిహెరాల్డ్.కామ్ తరుపు నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: